AKP: పాయకరావుపేట మండలంలో రబీలో సాగు చేస్తున్న పంటలకు ఈ క్రాప్ నమోదు 92% పూర్తయినట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ గురువారం తెలిపారు. 1,110 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన పంటలకు సంబంధించి ఈ క్రాప్ నమోదు రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతులకే రైతు సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు, మాజీ ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్, తదితరులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.
KRNL: జిల్లాలోని బేడబుడగ జంగాల సమస్యలను కోడుమూరు MLA దస్తగిరి ఇవాళ అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న వీరు ఆర్థికంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు అందక విద్యార్థుల ప్రవేశాలకు ఆటంకం కలుగుతోందని వివరించారు. ఇదే సమయంలో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే చిరకాల కోరికను నెరవేర్చాలని కోరారు.
అన్నమయ్య: పాలకుల కుట్రలకు ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు బలవుతున్నారని ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. ఆయన గురువారం ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. మద్యం పాలసీపై అప్పటి సీఎం చంద్రబాబు, ప్రభుత్వ పెద్దలపై వైసీపీ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మళ్లీ టీడీపీ రాగానే ఆ కేసులను క్లోజ్ చేయడం ఎంతవరకు సబబన్నారు.
KRNL: దేవనకొండ మండలం కరివేములలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ దేవాలయానికి ఆలూరు MLA విరుపాక్షి ఇవాళ రూ.20వేల విరాళం అందజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ఎమ్మెల్యే సేవాభావాన్ని గ్రామస్థులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కడప జిల్లా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ నెల 28వ తేదీనే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పింఛన్ లభించని వారికి మరల మార్చి 2వతేదీన పంపిణీ చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2,80,808 మంది లబ్దిదారులకు రూ.122,43,81,500ల నిధులు ఇప్పటికే తొమ్మిది రకాల బ్యాంకుల్లో జమ చేశారు అని డీఆర్డీయే పీడీ జి.రాజ్యలక్ష్మి వెల్లడించారు.
ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం మార్కాపురంలో R&B కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2సం. లు గడిచిన తమ సమస్యను పట్టించుకోలేదని, గర్భిణీ దశ నుండి చిన్నారుల పాఠశాలకు వెళ్లే వరకు సేవలందిస్తున్నామన్నారు.
ATP: అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రముఖ ఉడిపి హోటల్ను మార్కెట్ యార్డ్ ఛైర్పర్సన్ బల్లా పల్లవి గురువారం ప్రారంభించారు. హోటల్ యాజమాన్యం ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆమె రిబ్బన్ కట్ చేసి ఈ నూతన సంస్థను ప్రారంభించారు. నగర ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆమె నిర్వాహకులకు సూచించారు.
KDP: బద్వేల్ పరిధిలో కొనసాగుతున్న పాల కేంద్రాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీ నరసింహ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకో మిల్క్ అనలైజర్ మీటర్ ద్వారా రీడింగ్ చెక్ చేసుకుంటూ, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మంచి సేవలు అందిస్తున్న పాల కేంద్ర యజమాని శ్రీ లక్ష్మయ్యను అభినందించి, సన్మానించారు.
VZM: చీపురుపల్లి ప్రాంతీయ హాస్పిటల్ను గురువారం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఈనెల 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 14 సంవత్సరాల బాలికలకు హెచ్పీవి టీకా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా చీపురుపల్లి ఆరోజున చంద్రబాబు నాయుడు హాస్పిటల్ సందర్శించనున్నారు. అన్ని ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.
NLR: బుచ్చి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని స్థానిక ప్రజలు, కార్యకర్తలు నమోదు చేయించారు. ఇప్పటివరకు 200 సభ్యత్వాలు నమోదు చేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతంపై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.
W.G: ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు శ్రీనివాస్, బలరాం, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
GNTR: ఆయేషా మీరా అస్థికలను సీబీఐ తల్లిదండ్రులకు అప్పగించనుంది. రేపు తెనాలిలో భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. కేసులో దర్యాప్తు విఫలమైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని ఆశాభావం తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి డిసెంబర్ 27ను సంస్మరణ దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కోనసీమ: మార్చి 8 వ తేదీన అమలాపురంలోని కామనగరువు డిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆంధ్ర, కోనసీమ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చదరంగ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీసీ మమ్మీ గురువారం ఆవిష్కరించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు రూ.లక్ష నగదు బహుమతి, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు.
NLR: బుచ్చి పట్టణం బేల్దార్ పాళెం లోని పోలేరమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణం జరిగింది. మూడు రోజులు గా మహాకుభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పోతురాజుస్వామి విగ్రహం ప్రతిష్టించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.