• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంటూరులో అంగన్వాడీల నిరసన

GNTR: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం రూ. 26 వేలు, గ్రాట్యుటీ, మే నెల సెలవులు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న అంగన్వాడీలు, సమస్యల పరిష్కారం కోసం మార్చి 2న చేపట్టే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షురాలు రమణ పిలుపునిచ్చారు.

February 27, 2026 / 02:37 PM IST

వెంకటగిరి-ఏర్పేడు హైవేపై రోడ్డు ప్రమాదం

TPT: వెంకటగిరి-ఏర్పేడు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటగిరి నుంచి ఏర్పేడు వైపు వస్తున్న కారు దుగ్గిపేరి వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరు చనిపోయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని అంబులెన్సులో తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.

February 27, 2026 / 02:36 PM IST

‘జనగణన ప్రక్రియ గడువుకు ముందే పూర్తిచేయాలి’

PPM: మన్యం జిల్లాలో చేపట్టబోయే జనగణన 2027 ప్రక్రియను నిర్ణీత గడువుకు ముందే పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి మండల అధికారులకు పిలుపునిచ్చారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ, మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని హితవు పలికారు. గడువు వరకు వేచి ఉండకుండా ముందస్తు ప్రణాళికతో పని చెయ్యాలన్నారు.

February 27, 2026 / 02:35 PM IST

టెన్త్ విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణలకు రేపే లాస్ట్

E.G: మార్చి 2026లో నిర్వహించనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఉన్న వివరాల సవరణకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. రేపటి వరకు సవరణలకు అవకాశం ఉందన్నారు. విద్యాసంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 02:30 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాహాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 5వ రోజు అయిన శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 455 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ, బాటని, ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1538 మంది హాజరు కావాల్సి ఉండగా 1372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1500 మంది రాయాల్సి ఉండగా 1377 మంది విద్యార్థులు రాశారు.

February 27, 2026 / 02:30 PM IST

ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

VZM: ప్రపంచ ఎన్జీవో దినోత్సవం సందర్భంగా అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో శుక్రవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా పలువురు యువత రక్తదానం చేశారు. ఈసందర్బంగా మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు- త్యాడ ప్రసాద్ పట్నాయక్ నిరంతర రక్తదాత అయిన పోలుబోతు దుర్గాప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.

February 27, 2026 / 02:30 PM IST

పీకల వాగులో ప్లాస్టిక్ వ్యర్థాలు.. స్థానికుల ఇబ్బందులు

GNTR: కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ కింద ఉన్న ‘పీకల వాగు’ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. దీనివల్ల మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. కాలువలో పెరిగిన దోమలు, ఈగల వల్ల స్థానికులు జ్వరాలు, వైరల్ వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువను శుభ్రపరచాలని శుక్రవారం స్థానికులు కోరారు.

February 27, 2026 / 02:26 PM IST

జిల్లాలో ఎంత మంది విద్యార్థుల గైర్హాజరు అంటే..!

కర్నూలు: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 358 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప శుక్రవారం తెలిపారు. మొత్తం 5,069 మందికి గానూ 4,711 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని అధికారి వెల్లడించారు.

February 27, 2026 / 02:20 PM IST

‘ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి’

ELR: గణపవరం చింతలపాటి మూర్తి రాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శుక్రవారం హిస్టరీ, వొకేషనల్ పరీక్షలకు 25 మంది మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 23 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇద్దరు విద్యార్థులు గైరాజరయ్యారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది.

February 27, 2026 / 02:15 PM IST

ఆదోనిలో CMRF చెక్కుల పంపిణీ

KRNL: ఆదోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు చేతుల మీదుగా 70 మంది లబ్ధిదారులకు రూ. 27,56,659 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

February 27, 2026 / 02:15 PM IST

నగరి ఎమ్మెల్యేను కలిసిన ఆర్డీవో

CTR: నగరి డివిజన్ ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన ఎం.అనుపమ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, ప్రజలకు సేవలు వేగంగా అందించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. మాంగాడు, వీకేఆర్ పురం, కోసలనగరం పారిశ్రామిక వాడల పనులను వేగవంతం చేయాలని సూచించారు.

February 27, 2026 / 02:12 PM IST

జాతీయ స్థాయి క్రీడాకారులకు రామలింగారెడ్డి ఆర్థిక సాయం

ATP: షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయికి ఎంపికైన సిద్ధరాంపురం విద్యార్థులు అభిలాష్, అంజలికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. తల్లిదండ్రులు లేకపోయినా అంజలి కనబరిచిన పట్టుదలను ఆయన అభినందించారు. ఆ విద్యార్థిని చదువుకు, భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

February 27, 2026 / 02:12 PM IST

రేపు మల్లంపేటలో ఉచిత వైద్య శిబిరం

కాకినాడ: రౌతులపూడి మండలం మల్లంపేటలో శనివారం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. మమత ఆసుపత్రి, రాఘవ ఆసుపత్రి, పుష్ప ప్రాథమిక కంటి ఆసుపత్రులకు చెందిన వైద్య బృందం శిబిరంలో సేవలందిస్తుందని పేర్కొన్నారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.

February 27, 2026 / 02:12 PM IST

గరుడ వారధి వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

తిరుపతిలో గరుడ వారధి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి తాతయ్యగుంటకు చెందిన ద్వారక, తిరుచనూర్‌లో జరిగిన వివాహానికి వెళ్లి వస్తుండగా బ్లిస్ సర్కిల్ వద్ద బైక్ అదుపు తప్పి గరుడ వారధి గోడను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే మృతి చెందాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్సై హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 27, 2026 / 02:10 PM IST

‘ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి’

E.G: శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పట్ల అమర్యాదగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్సీలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో ర్యాలీ చేపట్టారు. శాసనసభలో ఒక సభ్యుడిపై ఇలాంటి దాడులకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు.

February 27, 2026 / 02:09 PM IST