VSP: భీమిలి పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలను నవంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు వేలం పాట వేయనున్నట్లు జడ్పీ సీఈవో ఇప్పి నాయుడు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరావత్తు చెల్లించి ఈ వేళంలో పాల్గొనవచ్చునని తెలిపారు. అదనపు సమాచారం కొరకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కోనసీమ: తుపాను నేపథ్యంలో మంగళవారం రావులపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన 23 బస్సులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. కాకినాడ 6, సామర్లకోట 2, ఏలూరు 5, బొబ్బర్లంక రూట్లో 5, ముక్తేశ్వరం, మురముళ్ల, ముమ్మిడివరం 3, నార్కేడిమిల్లి 1, కట్టుంగ 1 చొప్పున మొత్తం 23 బస్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
W.G: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలైన మొగల్తూరు, నరసాపురం మండలాల్లో 10 వేల మంది జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. 16 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. భీమవరం డివిజన్కు సంబంధించి భీమవరం మండలంలో 3, కాళ్ల, ఆకివీడు, భీమవరంలో 1 చొప్పున పునరావస 6 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ELR: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి చెందిన ఎస్ వీర్రాజు వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా శబరిమల రథంతో పాదయాత్రను కొనసాగించారు. మంగళవారం ఉదయం రథయాత్ర ఉంగుటూరులో ఆగింది. ఈ సందర్భంగా రథయాత్ర చేస్తున్న వీర్రాజు మాట్లాడుతూ.. రథంతో పాదయాత్ర ఇది రెండో సారి అని అన్నారు.
PLD: మొంథా తుపాను కారణంగా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, తాను, తన సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. మంగళవారం ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల నాయకులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు.
ప్రకాశం: రాచర్ల మండలంలోని పలుగుంటపల్లిలో బొప్పాయి పంటను ఉద్యానశాఖ అధికారి శ్వేత సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలు పంటలపై ఎలాంటి ప్రభావం చూపిందో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారి శ్వేత మాట్లాడుతూ.. బొప్పాయి పంటలో వ్యాధులు, నీటి నిల్వలు, ఎరువుల వినియోగం వంటి అంశాలను రైతులు శ్రద్ధగా గమనించాలని సూచించారు.
NDL: ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం ఉచిత వృక్ష ప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టింది. కార్తీక మాసం సందర్భంగా సోమవారం నుంచి ఈవితరణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఈ వితరణలో భక్తులకు ఉసిరి, తులసి, బిల్వం మొదలైన దేవతా మొక్కలను అందజేయనున్నట్లు తెలిపారు. పక్షిమగోదావరి జిల్లాకు చెందిన పి. ఆదినారాయణరాజు నాగవల్లి దంపతులు 21 వేల మొక్కలను విరాళంగా అందించినట్లు తెలిపారు.
SKLM: రణస్థలం తహసీల్దార్ కార్యాలయంలో మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ అప్పలనాయుడు సోమవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. అనంతరం కంట్రోల్ రూమ్ను అకస్మాత్తుగా సందర్శించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు సమాచారం అందేలా చూడాలని అన్నారు. తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు.
సత్యసాయి: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఉదయం పుట్టపర్తిలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం సైతం చల్లబడి చలి తీవ్రత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ELR: జిల్లాలో టార్పాలిన్లు రైతు సేవా కేంద్రాల్లో ఉంచామని వాటిని రైతులు వాడుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 626 బంకులలో 35,443 లీటర్లు డీజిల్, పెట్రోల్ ఆదనంగా నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. 1,500 మిల్లులను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేశామన్నారు.
కోనసీమ: జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాలు, ఇతర వివరాలను 8 నెలల క్రితం జియోట్యాగింగ్ చేయించినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదల సమయంలో ఆ వివరాల ఆధారంగా సహాయక చర్యలు అందించామన్నారు. ఇందులో ప్రతి ప్రాంతానికి సంబంధించిన సమగ్ర వివరాలు పొందుపర్చారు. దీని ఆధారంగా ఎక్కడ నివాసాలకు ముప్పు వాటిల్లుతుందో తక్షణం అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
NLR: మొంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. బొబ్బిలి రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు చెసే విశాఖ కోరాపుట్-విశాఖ పాసింజర్ ఎక్సప్రెస్, గుంటూరు రాయగడ-గుంటూరు ఎక్సప్రెస్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్శియల్ మేనేజర్ చెప్పారు.
W.G: ‘మొంథా’ తుఫాను ప్రభావంతో భారతీయ రైల్వే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమ, మంగళవారం విజయవాడ – విశాఖ మధ్య నడిచే ప్రధాన రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఉమ్మడి ప.గో. జిల్లా మీదుగా నడిచే ముంబై- విశాఖ, విశాఖ-తిరుపతి, విశాఖ-చెన్నై, విశాఖ-మచిలీపట్నం, గుంటూరు-రాయగడ, విశాఖ- సికింద్రాబాద్, ఏపీ ఎక్స్ ప్రెస్లు రద్దు చేశారు.
కోనసీమ: ఆత్రేయపురం పల్లపు వీధిలో సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. కాంతం అనే వృద్ధురాలి ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ, విద్యుత్ బోర్డులు కాలిపపోయాయి. దీంతో దట్టమైన పొగలు వ్యాపించి, ఇంట్లో కాంతం చిక్కుకున్నారు. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి ఆమెను కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది.
PPM: చీకటి జీవోలు రద్దు చేయాలి అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకొని తీరాలి అని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఆయన పార్వతీ పురం మండలం MR నగర్లో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో మాటలు ఆడుతూ.. ప్రతీ ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో జగన్ గారు గతంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు అన్నారు.