కోనసీమ: తుపాను నేపథ్యంలో మంగళవారం రావులపాలెం ఆర్టీసీ డిపోకు చెందిన 23 బస్సులను రద్దు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. కాకినాడ 6, సామర్లకోట 2, ఏలూరు 5, బొబ్బర్లంక రూట్లో 5, ముక్తేశ్వరం, మురముళ్ల, ముమ్మిడివరం 3, నార్కేడిమిల్లి 1, కట్టుంగ 1 చొప్పున మొత్తం 23 బస్సులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.