దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని బాపట్లలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వమే అలా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోక్సభలో టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయం గురించి కేంద్రమంత్రిని అడిగారు. దీంతో అతను దక్షిణ కోస్తా రైల్వేజోన్ విషయంలో ఏపీ సర్కార్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. మిస్సైన వారు 7వ తరగతి చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అదృశ్యమైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) కారణంగా తమిళనాడులోని పలు నగరాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలు చోట్ల పంటలు నష్టపోయాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని అతని నివాసంలో ఆయన్ని కలిశారు. పార్టీ విషయాలు గురించి మట్లాడుకున్నట్లు సమాచారం.
మిగ్జామ్ తుఫాన్ బాపట్ల తీరాన్ని దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ నెలలో కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రెండో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. నిజాంపట్నం వద్ద 20 ఏళ్ల తర్వాత 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతేనని మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో రాజధానులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ల విషయంపై ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో ఏపీ రాజధాని గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సందర్శనీయ ప్రదేశాల్లోకి భక్తుల అనుమతులను రద్దు చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆ ప్రాంతాల్లోకి అనుమతులు ఇస్తామని ప్రకటించింది.
ఏపీలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతోంది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర నెంబర్లను ప్రభుత్వం ప్రకటించింది. కుండపోత వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కాజీపేట-విజయవాడ రూట్లలో(Kazipet-Vijayawada route) ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు అలర్ట్. ఎందుకంటే ఈ రూట్లలో ఈనెల 18 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే ఆ ట్రైన్స్ ఎంటి ? ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఏపీ రాష్ట్రానికి తుపాను పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. రైతుల వద్ద ఉన్న ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలని దీంతోపాటు పలు శాఖల అధికారులు తుపాను సహాయక చర్యలకోసం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభావంతో పలు చోట్ల వానలు కురియనున్నట్లు తెలిపారు.
టీటీడీ నిధులను తిరుమల అభివృద్ధికి ఉపయోగించొద్దు అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పాలక మండలికి సూచించారు. ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.