అన్నమయ్య: రాయచోటిలోని జిల్లా గణాంకాల ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న పెద్దయ్యకు గురువారం ఉపసంచాలకులుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా సిబ్బంది, కార్యాలయం సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డివిజన్ డీవైఎస్ఓ రామ్మోహన్ నాయక్తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.