KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ నెల 30న సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు బాష అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా సోమవారం తెలిపారు. స్త్రీ, పురుషులకు 100,200,400,800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో పోటీలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులన్నారు.