ప్రకాశం: వెలిగిండ్ల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈవో రామిరెడ్డి తుఫాను ప్రభావంపై ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. తుఫాను ప్రభావం కారణంగా ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తగిన జాగ్రత్తలు పాటించేలా ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు.