GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.