KRNL: ఈ నెల 16న PM మోదీ జిల్లా పర్యటన ఏర్పాట్లపై CM చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకుంటారని సీఎం తెలిపారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు.