ASR: కొయ్యూరు మండలంలోని ఎం.మాకవరం రైతు సేవా కేంద్రం పరిధిలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి డీ.ఉమాదేవి ధాన్యం కొనుగోళ్లును పరిశీలించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కోనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ధాన్యం తేమ శాతం 17శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. ఇప్పటి వరకూ ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్మును ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.