అన్నమయ్య: పెద్దమండ్యం మండలం కలిచర్లలో కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీలత (18) అనే ఎనిమిది నెలల గర్భిణీ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.