ATP: రాయదుర్గం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో వెలసిన సవదత్తి రేణుక ఎల్లమ్మ సోమవారం సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు అభయం ఇచ్చింది. దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా 8వ రోజు అమ్మవారికి పురోహితులు రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ఇవాళ దర్శించుకుంటే సరస్వతి దేవి కరుణాకటాక్షం సిద్ధిస్తుందని పేర్కొన్నారు.