E.G: మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి-పూజారిపాకలు రోడ్డుకు ఎమ్మెల్యే మంగళవారం శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఏ సమయంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే అన్నారు.