AKP: ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మాడుగుల ఎంపీడీవో కొంకి అప్పారావు కోరారు. మంగళవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆధార్ తప్పనిసరిగా చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ కొండాజీ, శాంతి, సరోజినీ, దేవి పాల్గొన్నారు.