W.G: భీమవరంలో ఈనెల 19వ తేదీన సుమారు 5 వేల మందితో యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మంగళవారం పట్టణంలోని గన్నాబత్తుల క్రీడా మైదానాన్ని జేసీ రాహుల్, ఆర్డీవో ప్రవీణ్ సిబ్బందితో కలిసి పరిశీలించి ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.