SKLM: పోలాకి మండలం మబగాం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు శుక్రవారం ఉదయం తెలిపారు. మబగాం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఈ దుస్థితి నెలకొందని అన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందన్నారు. సంబంధిత శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి రోగాల బారి నుండి కాపాడాలంటూ తెలియజేశారు.