TPT: రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి 11:15 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. పలువురు నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. ఇవాళ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు సంవత్సరీకంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.