కోనసీమ: మలికిపురం మండలంలోని విశ్వేశ్వరాయపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 5వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని 11 మంది బాధిత కుటుంబాలకు 12 లక్షల రూపాయలు చెక్కులను అందజేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.