అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని మసాపేట, గాలివీడు రోడ్డు, మదనపల్లె రోడ్డులలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఆయనను సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పలు వీధులలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.