కృష్ణా: బాపులపాడు మండలం వీరవల్లి పీఎస్ పరిధిలోని NSM కంపెనీ క్వార్టర్స్లో దొంగ నోట్లు చలామణి చేసే ముఠాను, ఒక ప్రింటర్ను సోమవారం వీరవల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు భాషా, మస్తాన్ అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. రాజోలు కేంద్రంగా చేసుకొని, గన్నవరంలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తూ దొంగనోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసుల సమాచారం.