WG: నరసాపురం మండలం లిఖితపూడిలో ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని మొత్తం 186 పశువులకు ఉచితంగా టీకాలు వేశారు. పశువైద్యాధికారి డాక్టర్ ఐ.సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలం, శీతాకాలం సమయాల్లో పశువులకు సోకే గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.