VZM: రాష్ట్ర రవాణా క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిసెంబర్ 20వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి ఆరోజు మధ్యాహ్నం 1 గంటలకు విశాఖ నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలో విజ్జి స్టేడియంను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు పార్వతీపురం బయలుదేరి వెళ్లనున్నారు.