NDL: పాణ్యం మండలం పిన్నాపురం గ్రామ సమీపంలో ఉన్న సోలార్ కంపెనీలో కాపర్ వైర్ చోరీకి గురైనట్లు కంపెనీ వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాపర్ వైర్ చోరీ కేసులో ఆరుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ముద్దాయిల నుండి 240 కేజీల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు.