కృష్ణా: జి. కొండూరు మండలం కోడూరు డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఎన్నిక మంగళవారం ఏకగ్రీవమైంది. అధ్యక్షుడిగా తోలుకోడుకు చెందిన ఇనుగంటి శోభన్ బాబు, ఉపాధ్యక్షుడిగా వెల్లటూరుకు చెందిన ఎలిసల సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మంగళవారం ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు వారికి ధ్రువపత్రాలు అందజేశారు. దీంతో పలువురు కూటమి నాయకులు అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు.