CTR: తిరుపతి పర్యటన అనంతరం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజు ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపసభాపతికి పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయ తీర్ధప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని బహూకరించారు.