MBNR: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం (పిల్లలమర్రి)లో గురువారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. నాలుగు ప్రైవేట్ సంస్థల్లో 150 ఖాళీలు ఉన్నాయని, ఎస్ఎస్సీ, ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణులైన 18-30 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లా అభ్యర్థులు ఆధార్, సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.