KMM: జిలుగుమాడుకి చెందిన గర్భిణీ నాగలక్ష్మికి నిన్న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా సిరిపురం వద్ద నొప్పులు పెరగడంతో మార్గమధ్యంలోనే అంబులెన్స్లో ప్రసవం జరిగింది. ఈఎంటీ విజయభాస్కర్, పైలట్ రాజేష్ సాయంతో తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారు.