W.G: భీమవరంలో కలెక్టరేట్ నిర్మించడానికి స్థలాలు ఉన్నాయని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణంపై ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భీమవరం మార్కెట్ యార్డులో 20 ఎకరాలు, తాలూకా ఆఫీసు వద్ద 6 ఎకరాలు స్థలం ఉందన్నారు. అసలు పట్టణంలో స్థలం లేదని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు.