SKLM: ద్రవ్యాల వినియోగం పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఈగల్ టీం సభ్యులు ఉదయ్ కుమార్, మల్లేశ్వరరావు తెలిపారు. బుధవారం టెక్కలి మండల కేంద్రంలోని ఎస్వీఆర్కే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల జోలికి వెళ్తే జీవితాలు సర్వనాశనం అవుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగినట్లయితే 1972కు ఫోన్ చేయాలన్నారు.