CTR: పుంగనూరు పట్టణం ప్రైవేటు బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా మంగళ రూపిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను పంచామృతలతోపాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. సింధూరం, కుంకుమ, పసుపు, వివిధ పుష్పాలతో మంగళ రూపినిగా అలంకరించి పూజలు నిర్వహించారు.