CTR: చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం లక్ష్మీ నగర్ కాలనీలోని ప్రజాదర్బార్లో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీ ఆర్ఎస్)” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు.