ASR: జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం అరకులోయ మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జీ.మాడుగుల 6.2, గూడెం కొత్తవీధి 7.2, హుకుంపేట 7.4, చింతపల్లి 7.5, ముంచంగిపుట్టు, పెదబయలు 9.7, అనంతగిరి 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందన్నారు.