W.G: ఢిల్లీ పేలుళ్లతో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. నరసాపురం సెంటర్లో సీఐ యాదగిరి ఆధ్వర్యంలో వాహనాలను విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లో తనిఖీలతోపాటు అనుమానితులను విచారిస్తున్నారు. నరసాపురం నుంచి 216 జాతీయ రహదారి గుండా జిల్లా వైపు వచ్చివెళ్లే వాహనాలన్నింటినీ నిలుపుదల చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.