సత్యసాయి: పెనుకొండలోని ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ద్వారా ఆదివారం 730వ రోజు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. నిరుపేదలు, అనాథలు క్యాంటీన్లోని భోజనాన్ని స్వీకరించారు. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లను మూసేయడంతో మంత్రి సవిత తన సొంత ఖర్చుతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా పేదలకు ప్రతిరోజూ అన్నదానం చేస్తున్నారు.