SKL: నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామంలోని శ్రీ సాంబ జగదీశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబు ఆలయ ద్వారాలు తెరవగానే, సూర్యుని లేలేత కిరణాలు నేరుగా గర్భగుడిలో కొలువుదీరిన శివలింగాన్ని తాకాయి. ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి అని అర్చకులు తెలిపారు.