అనంతపురంలో మానవత్వం చాటుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందిన ధనలక్ష్మి(40) అనే అనాథ మహిళకు బాబావాలి కబ్రస్తాన్ ప్రతినిధులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుమారుడు అఖిల్ దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఐఎంఎం మహబూబ్ భాషా సమాచారం మేరకు వారు స్పందించారు.