KRNL: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని UTF మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కోసిగి మం. జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.