VZM: కూటమి ప్రభుత్వం పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాజాం YCP ఇన్చార్జ్ తలే రాజేష్ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలు వల్ల రైతులు మానసికంగా ఆర్ధికంగా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. అకాల వర్షాలు తుపానుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించడం లేదన్నారు.