కడప: లింగాల మండలం ఇప్పట్లలో ఉన్న లీలావతి చారిటబుల్ ట్రస్టులో మంగళవారం పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు వృద్ధుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధృవకుమార్ రెడ్డి వైఎస్ షర్మిల జన్మదిన కేకును కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.