SKLM: నందిగం మండలం కాపుతెంబూరు గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న తుంగాన చైతన్య(32) అనే వ్యక్తి గురువారం విశాఖలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మూడు రోజుల క్రితం బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం విశాఖ తరలించగా అక్కడ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.