కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కు ఆదివారం రాజమండ్రికు చెందిన హనుమంశెట్టి దుర్గాప్రసాద్ దంపతులు రూ.70,001, వానపల్లికి చెందిన కర్రీ రామారెడ్డి దంపతులు రూ.25,116లు విరాళంగా ఆలయ డీసీ చక్రధరరావుకు అందజేశారు. ముందుగా వారు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.