కోనసీమ: రాజోలు నీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం రాజోలు ఎంపీడీవో కార్యాలయం నందు తహశీల్దార్ ప్రసాద పర్యవేక్షణలో జరిగింది. చైర్మన్గా శివకోడు గ్రామానికి చెందిన పినిశెట్టి బుజ్జి, వైస్ చైర్మన్గా గొంది గ్రామానికి చెందిన నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని ఘనంగా సత్కరించారు.