NLR: విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో A&D స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. సామాజికంగా వెనుకబడిన గిరిజనుల ఆర్థికాభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 500 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. గిరిజనుల వెనుకబాటుతనంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.