ప్రకాశం: ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ ఆధునికీకరణ అవినీతిపై విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గౌస్ డిమాండ్ చేశారు. స్థానిక 60 అడుగులరోడ్డులో పోతురాజు కాలువ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త మధ్యలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ నగర ప్రజలు ముంపు బారినుంచి రక్షించాలని కోరారు.