GNTR: గ్రామాల సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు నరసారావుపేట ఎంపీడీవో టీ.వీ కృష్ణకుమారి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పంచాయతీ సెక్రటరీలు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ తరగతులను రెండో రోజు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలోనూ తాగునీరు, పారిశుధ్యంపై దృష్టి సారించాలన్నారు.