KRNL: కోసిగిలో ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ వేడుకలను శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.