CTR: మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై దాడులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, మీడియాపై దాడులకు పాల్పడడం అప్రజాస్వామీకం, ఆటవిక చర్య అని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్న మీడియాతో సమన్వయంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. దాడిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని పేర్కొన్నారు.