కృష్ణా: కోడూరు మండల పరిధిలోని విశ్వనాథపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ అంతరాయం నిలిపివేస్తున్నట్లు ఉయ్యూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. కృష్ణనాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్స్టేషన్ పరిధిలోని పిట్టలంక రూరల్ ఫీడర్, ఎక్స్ప్రెస్ ఫీడర్ RDSS పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.