E.G: ఈనెల 6న కోటిపల్లి బస్టాండ్ వద్ద రోడ్డుప్రమాదంలో దురదృష్టవశాత్తు విజయకృష్ణ (28) ప్రాణాలు కోల్పోయాడు. కాగా తల్లిదండ్రులు కూమారుడి అవయవదానానికి అంగీకరించారు. విషయం తెలుసుకున్నMLC సోము వీర్రాజు విజయ్ కృష్ణ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ ఉదాత్తమైన నిర్ణయం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని, అవయవదానానికి అందరు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు.